
నాగచైతన్య, నిధి అగర్వాల్, వెన్నెల కిశోర్, శంకర్, చందు మొండేటి
న్యూయార్క్లో తన మార్క్ కనిపించేలా చిందేస్తున్నారు హీరో నాగచైతన్య. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేని నవీన్, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ‘సవ్యసాచి’. ప్రవీణ్. ఎమ్ సహనిర్మాత. ‘‘న్యూయార్క్లో జరుగుతోన్న ఈ చివరి షెడ్యూల్తో సినిమా చిత్రీకరణ ముగుస్తుంది.
పదిహేను రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో ఒక సాంగ్తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. చైతూ అక్కగా భూమిక, ఓ కీలక పాత్రలో మాధవన్ కనిపించనున్నారు’’ అని పేర్కొంది చిత్రబృందం. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. రావు రమేష్, ‘వెన్నెల’ కిషోర్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్, సంగీతం: కీరవాణి.