మణిరత్నం సినిమా ఖరార్ | Mani Rathnam Working on Spy Thriller | Sakshi
Sakshi News home page

మణిరత్నం సినిమా ఖరార్

Apr 2 2014 11:34 PM | Updated on Jul 15 2019 9:21 PM

మణిరత్నం సినిమా ఖరార్ - Sakshi

మణిరత్నం సినిమా ఖరార్

దక్షిణాదిలోనే ఓ భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమైంది. మణిరత్నం దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సంచలన చిత్రం రూపొందనుంది. ఇందులో నాగార్జున,

దక్షిణాదిలోనే ఓ భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమైంది. మణిరత్నం దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సంచలన చిత్రం రూపొందనుంది. ఇందులో నాగార్జున, మహేశ్‌బాబు నటించనున్నారు. ఈ విషయం ఎట్టకేలకు సాధికారికంగా వెల్లడైంది. ఈ చిత్రంలో నాగ్ సరసన ఐశ్వర్యారాయ్, మహేశ్‌కి జోడీగా శ్రుతీహాసన్ చేయనున్నారు. ఈ కాంబినేషన్‌లో మణిరత్నం ద్విభాషా చిత్రం చేస్తున్నట్లు సుహాసిని ఓ తమిళ చానల్‌కు బుధవారం తెలిపారు. తెలుగులో ఓ అగ్రనిర్మాణ సంస్థతో కలిసి మణిరత్నం ఈ ప్రాజెక్ట్ చేయనున్నారని సమాచారం. నిజానికి, ఈ ప్రాజెక్టుపై మణిరత్నం చాలాకాలంగా కసరత్తులు చేస్తున్నారు. నాగార్జునతో ‘గీతాంజలి’ తర్వాత ఆయన డెరైక్ట్‌గా తెలుగులో ఏ సినిమా చేయలేదు.
 
  తెలుగునాట కూడా మణిరత్నంకు చాలా మంది అభిమాను లున్నారు. మణిరత్నంతో సినిమాకు మహేశ్ చాలా కాలంగా ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఏడాది ఓ భారీ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా, ఎందుకో కార్యరూపం ధరించలేదు. ‘కడలి’ తర్వాత మణిరత్నం ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. ఎట్టకేలకు ఇప్పుడీ సినిమా పట్టాల మీదకెక్కు తోంది. దాంతో, మహేశ్ ఈ సినిమా చేయడం లేదంటూ ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలు తప్పని తేలింది. ఇందులో ఓ పాకిస్తానీ నటి కూడా కీలకపాత్ర పోషించనున్నారట. హాలీవుడ్ చిత్రం ‘బోర్న్ ఐడెంటిటీ’ తరహాలో ఇది స్పై థ్రిల్లర్ అని చెన్నై వర్గాల కథనం. రెహమాన్ దీనికి స్వరాలందించనున్నారట. రవివర్మన్ ఛాయాగ్రాహకుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement