
కార్తికేయ
భగవంతుడు, సైన్స్... ఈ రెండింటిలో మనిషి నమ్మాల్సింది దేనిని? అనే ప్రశ్నకు సమాధానంగా రూపొందిన చిత్రం ‘కార్తికేయ’. ‘స్వామిరారా’ జంట నిఖిల్, స్వాతి కలిసి నటించిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు.
భగవంతుడు, సైన్స్... ఈ రెండింటిలో మనిషి నమ్మాల్సింది దేనిని? అనే ప్రశ్నకు సమాధానంగా రూపొందిన చిత్రం ‘కార్తికేయ’. ‘స్వామిరారా’ జంట నిఖిల్, స్వాతి కలిసి నటించిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. వెంకట శ్రీనివాస్ బొగ్గారం నిర్మాత. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిఖిల్ మాట్లాడుతూ -‘‘సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందింది. స్వాతి, నేనూ జంటగా నటించిన ‘స్వామి రారా’ చిత్రం 140 థియేటర్లలో విడుదలైతే, ఈ చిత్రాన్ని 250 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఇటీవలే విడుదలైన ప్రచార చిత్రాలకు కూడా మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 24న దీపావళి కానుకగా సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఇందులో తన పాత్ర పేరు వల్లీ అని, ఎంజాయ్ చేస్తూ ఈ పాత్ర చేశానని ‘కలర్స్’ స్వాతి తెలిపారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే సస్పెన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని దర్శకుడు నమ్మకం వెలిబుచ్చారు. ఈ సినిమా బాగా రావడానికి కారణం యూనిట్ సభ్యుల సహకారమే అని నిర్మాత అన్నారు.