సెన్సార్ పూర్తి చేసుకున్న జై లవ కుశ | Jai Lava kusa Completed censor formalities | Sakshi
Sakshi News home page

సెన్సార్ పూర్తి చేసుకున్న జై లవ కుశ

Sep 13 2017 2:32 PM | Updated on Sep 19 2017 4:30 PM

సెన్సార్ పూర్తి చేసుకున్న జై లవ కుశ

సెన్సార్ పూర్తి చేసుకున్న జై లవ కుశ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా జై లవ కుశ. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా జై లవ కుశ. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా బుధవారం (13-09-2017) సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. 2 గంటల 35 నిమిషాల నిడివితో రిలీజ్ అవుతున్న జై లవ కుశ ఎన్టీఆర్ అభిమానులను ఖుషీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియోకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement