అమెరికా దళాలే లక్ష్యంగా.. ఇరాక్ స్థావరాలపై దాడులు

Military Says Rockets Target Iraq Airbase Hosting US Forces - Sakshi

అమెరికా దళాలే లక్ష్యంగా మరోసారి దాడులు జరిగాయి. ఇరాక్‌లోని సైనిక స్థావరాలపై రాకెట్లతో దాడులు జరిగాయి. తాజీ స్థావరం వద్ద ఖత్యుషా తరహా రాకెట్లు ​పేలినట్లు ఇరాక్ ​మిలటరీ ప్రకటించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. దాదాపు రెండు రాకెట్లు అమెరికా దళాలు ఉన్న ఇరాక్‌లోని సైనిక  స్థావరాల వైపు దూసుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకూ ఎవరూ బాధ్యత వహించలేదు.

చదవండి: ఉద్రిక్తతలు తగ్గాలనే కోరుకుంటున్నాం

కాగా.. గత ఆదివారం అల్ బలాద్ వైమానిక స్థావరంపై కూడా ఇదే తరహాలో రాకెట్ దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య​ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటి నుంచి ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై పలుమార్లు రాకెట్ల దాడి జరిగింది. ఇరాన్ ​అగ్ర కమాండర్ ఖాసీం సులేమానీ హత్య తర్వాత అమెరికా సైన్యమే లక్ష్యంగా ఇరాన్​ క్షిపణి దాడులు చేసింది. అయితే తాజా జరిగిన దాడులు కూడా ఇరానే చేసింటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top