విజయసాయిరెడ్డి ఎన్నికపై కువైట్లో సంబురాలు | In Kuwait Celebrated grandly vijayasai reddy elected as Rajyasabha member | Sakshi
Sakshi News home page

విజయసాయిరెడ్డి ఎన్నికపై కువైట్లో సంబురాలు

Jun 1 2016 9:56 PM | Updated on Aug 9 2018 2:42 PM

విజయసాయిరెడ్డి ఎన్నికపై కువైట్లో సంబురాలు - Sakshi

విజయసాయిరెడ్డి ఎన్నికపై కువైట్లో సంబురాలు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు కువైట్‌లోని మలియా ప్రాంతంలో వైఎస్ఆర్‌సీపీ కువైట్ కన్వీనర్ యం. బాలిరెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు.

కువైట్: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు కువైట్‌లోని మలియా ప్రాంతంలో వైఎస్ఆర్‌సీపీ కువైట్ కన్వీనర్ యం. బాలిరెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి. హెచ్ మాట్లాడారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టిన నైతిక విలువలకు కట్టుబడి నిరంతరం పార్టీ అభివృద్ధికి పాటు పడుతున్న విజయసాయి రెడ్డికి రాజ్యసభ పదవి దగ్గడం సంతోషకరమైన విషయమని అన్నారు. కువైట్ కమిటీ, గల్ఫ్ ప్రవాసాంధ్రుల తరపున పత్రికా ముఖంగా విజయసాయిరెడ్డికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర దేశ రాజకీయాలలో నైతిక విలువలకు కట్టుబడిన ఏకైక రాజకీయ పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అని నిరూపిస్తూ మాట తప్పని మడమ తిప్పని మా అధినేత వై.యస్. జగన్మోహన్ రెడ్డి అని యం.బాలిరెడ్డి కొనియాడారు. వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి విజయసాయి రెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వడం అభినందనీయమని తామంతా వైఎస్‌ఆర్‌సీపీలో పనిచేస్తుందుకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సహా కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం.వి. నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రేహామాన్ ఖాన్, యన్. మహేశ్వర్ రెడ్డి, యం. చంద్రశేఖర్ రెడ్డి, సభ్యులు  నాగిరెడ్డి చంద్ర, పి. సురేష్ రెడ్డి, రమణ యాదవ్, లాజరస్, మర్రి కళ్యాణ్ దుగ్గి గంగాధర్ జి. ప్రవిణ్ కుమార్ రెడ్డి, షా హుస్సేన్, షేక్ గఫార్, సయ్యద్ సజ్జద్, రఫీఖ్ ఖాన్, మహాబూబ్ బాషా, అబుతురాబ్, వాసుదేవ రెడ్డి, మధు సుధన్ రెడ్డి, జయచంద్ర రెడ్డి, హనుమంతు రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement