ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం
మనీలా: ఫిలిప్పీన్స్లో శనివారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. మిండనావో ద్వీపం యొక్క అతిపెద్ద నగరమైన డావావో తీరాన, పాండగువన్ పట్టణానికి సుమారు 62 మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లుగా యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.