సముద్రంలో పడవ మునక.. నలుగురి మృతి | boat dip in black sea | Sakshi
Sakshi News home page

సముద్రంలో పడవ మునక.. నలుగురి మృతి

Sep 22 2017 4:41 PM | Updated on Sep 22 2017 6:52 PM

boat dip in black sea

టర్కీ సముద్ర తీరంలో పడవ మునిగి నలుగురు శరణార్థులు మృతిచెందారు.

ఇస్తాంబుల్‌(టర్కీ): టర్కీ సముద్ర తీరంలో పడవ మునిగి నలుగురు శరణార్థులు మృతిచెందారు. మరో 20 మంది గల్లంతయ్యారు. కోస్టుగార్డు సిబ్బంది మరో 38 మందిని రక్షించారు. 

శరణార్థులు యూరోపియన్‌ దేశాలకు వెళ్లడానికి ఏజియన్‌ సముద్ర మార్గం కష్టంగా ఉండటంతో వారు నల్ల సముద్రం ద్వారా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కోస్టుగార్డులు తెలిపారు. వలసదారులను అడ్డుకోవడానికి యూరోపియన్‌ యూనియన్‌ టర్కీ దేశం గత మార్చిలోనే ఒప్పందం కుదుర్చుకుంది. అయినప్పటికీ వలసలు ఆగటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement