బస్సు ప్రమాదంలో 19 మంది మృతి | 19 killed in road accident in kenya | Sakshi
Sakshi News home page

బస్సు ప్రమాదంలో 19 మంది మృతి

May 13 2017 4:34 PM | Updated on Aug 30 2018 4:10 PM

వేగంగా వెళ్తున్న బస్సు వాహనాలను ఓవర్‌టేక్‌ చేసే యత్నంలో..

నైరోబీ: వేగంగా వెళ్తున్న బస్సు వాహనాలను ఓవర్‌టేక్‌ చేసే యత్నంలో ఎదురుగా వస్తున్న రెండు ట్రక్కులను ఢీ కొట్టడంతో 19 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కెన్యా రాజధాని నైరోబీకి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిలి​‍్జల్‌ గ్రామం వద్ద శనివారం ఉదయం జరిగింది. ముందున్న వాహనాలను అధిగమించే క్రమంలో బస్సు డ్రైవర్‌ వేగంగా ఎదురుగా వస్తున్న రెండు ట్రక్కులను ఢీ కొట్టాడు. దీంతో అక్కడికక్కడే 18 మంది చనిపోయారు.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరొకరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కెన్యాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా 12 వేల మంది మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement