న్యూయార్క్ నగరంలో నిత్యం రద్దీగా టైమ్ స్క్వేర్లో 11 వేలమందికిపైగా యోగా చేశారు.
న్యూయార్క్: భారతీయ జీవన విధానంలో భాగమైన యోగాకు ఖండాంతరాలలోనూ ప్రాచుర్యం లభిస్తోంది. న్యూయార్క్ నగరంలో నిత్యం రద్దీగా టైమ్ స్క్వేర్లో 11 వేలమందికిపైగా యోగా చేశారు. శనివారం క్రాస్ రోడ్స్ వద్ద చాపలు వేసుకుని ఆసనాలు చేశారు.
ఈ కార్యక్రమం చేయడం సాహసమని టైమ్స్ స్క్వేర్ అలియెన్స్ అధ్యక్షుడు టిమ్ టాంప్కిన్స్ అన్నారు. యోగా ప్రక్రియలో సూర్యుడిని ఆరాధించే దినమని 25 ఏళ్ల యోగా శిక్షకురాలు క్రిస్టీనా కీలుస్నియక్ అన్నారు. న్యూయార్క్ నగరంలో టైమ్స్ స్క్వేర్ అతిపెద్ద వాణిజ్య సముదాయం.