2న పాడేరులో వైఎస్ జగన్ బహిరంగ సభ

2న పాడేరులో వైఎస్ జగన్ బహిరంగ సభ - Sakshi


హైదరాబాద్: బాక్సైట్ తవ్వకాలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. 'బాక్సైట్ తవ్వకాలు-గిరిజనుల హక్కులు' అనే అంశం పై డిసెంబర్ 2న పాడేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సభ నిర్వహించనున్నారు. బాక్సైట్ తవ్వకాలను నిరోధించేందుకు 11 మంది సభ్యులతో గిరిజన హక్కుల కమిటీని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు.


 


ఈ కమిటీలో గిడ్డి ఈశ్వరి, కె.సర్వేశ్వరరావు, కే.రాజన్నదొర, పి. పుష్పశ్రీవాణి, వి. కళావతి, వంతల రాజేశ్వరి, తెల్లం బాలరాజా, గుడివాడ అమర్నాథ్, సుజయ్ కృష్ణ రంగారావు, ధర్మాన ప్రసాదరావు, విజయసాయి రెడ్డిలను సభ్యులుగా నియమించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top