జీవితాంతం కలిసుంటానని ప్రమాణం చేసి వివాహం చేసుకున్న భర్త.. అర్థాంతరంగా విడాకులు కోరడంతో దిక్కుతోచని స్థితిలో శిల్ప అనే మహిళ అత్తింటి ముందు రెండు రోజులుగా ధర్నాకు దిగింది.
హైదరాబాద్: జీవితాంతం కలిసుంటానని ప్రమాణం చేసి వివాహం చేసుకున్న భర్త.. అర్థాంతరంగా విడాకులు కోరడంతో దిక్కుతోచని స్థితిలో శిల్ప అనే మహిళ అత్తింటి ముందు రెండు రోజులుగా ధర్నాకు దిగింది. తిరుమలగిరి లోతుకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్ఆర్ఐ రజనీకాంత్తో శిల్పకు 2013లో వివాహం జరిగింది. ఇంతకాలం శిల్పతో సజావుగానే కలిసున్న రజినీకాంత్ అకస్మాత్తుగా అమెరికా కోర్టులో విడాకులను కోరాడు. దీంతో తనకు న్యాయం చేయాలని శిల్ప అత్తింటి ముందు ధర్నాకు దిగింది.