అత్తింటి ముందు మహిళ ధర్నా | women protesting infront of aunt house | Sakshi
Sakshi News home page

అత్తింటి ముందు మహిళ ధర్నా

Jan 3 2016 2:47 PM | Updated on Sep 3 2017 3:01 PM

జీవితాంతం కలిసుంటానని ప్రమాణం చేసి వివాహం చేసుకున్న భర్త.. అర్థాంతరంగా విడాకులు కోరడంతో దిక్కుతోచని స్థితిలో శిల్ప అనే మహిళ అత్తింటి ముందు రెండు రోజులుగా ధర్నాకు దిగింది.

హైదరాబాద్: జీవితాంతం కలిసుంటానని ప్రమాణం చేసి వివాహం చేసుకున్న భర్త.. అర్థాంతరంగా విడాకులు కోరడంతో దిక్కుతోచని స్థితిలో శిల్ప అనే మహిళ అత్తింటి ముందు రెండు రోజులుగా ధర్నాకు దిగింది. తిరుమలగిరి లోతుకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్ఆర్ఐ రజనీకాంత్తో శిల్పకు 2013లో వివాహం జరిగింది. ఇంతకాలం శిల్పతో సజావుగానే కలిసున్న రజినీకాంత్ అకస్మాత్తుగా అమెరికా కోర్టులో విడాకులను కోరాడు. దీంతో తనకు న్యాయం చేయాలని శిల్ప అత్తింటి ముందు ధర్నాకు దిగింది.

 

Advertisement
 
Advertisement
Advertisement