'ముందే సీట్లు అమ్ముకుంటే చర్యలు' | will take action selling engineering seats of colleges, says Papireddy | Sakshi
Sakshi News home page

'ముందే సీట్లు అమ్ముకుంటే చర్యలు'

Jun 22 2016 4:28 PM | Updated on Sep 4 2017 3:08 AM

తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అడ్మిషన్లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలంగాణ ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అడ్మిషన్లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలంగాణ ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. జులై 1 లోపే జేఎన్టీయూ నుంచి కాలేజీల లిస్ట్ వస్తుందని ఆయన చెప్పారు. బుధవారం హైదరాబాద్లో పాపిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.

ఆప్లియేషన్ లిస్ట్ వచ్చాకే 'బి' కేటగిరి సీట్లపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ముందే ఇంజనీరింగ్ సీట్లు అమ్ముకుంటే ఆయా కాలేజీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పాపిరెడ్డి హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement