* హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
* అదేమైనా అంత పెద్ద సంస్థా?
* అసలు దానికి చట్టంలో చోటెక్కడుంది?
* దానికన్నా లోకల్ పోలీసులే నయం
* కెనెటా పవర్పై వ్యాజ్యం విచారణకు విముఖత
* పిటిషన్ ఉపసంహరించుకున్న పిటిషనర్
సాక్షి, హైదరాబాద్ : ‘‘సీబీఐ.. సీబీఐ..! ఎందుకంతా దాని వెంటపడతారు? అదేమైనా అంత పెద్ద సంస్థా? జస్ట్ ఓ డిటెక్టివ్ ఏజెన్సీలాంటిది. అది ఛేదించలేని కేసులెన్నో స్థానిక పోలీసులు ఛేదించారు. అయినా అందరికీ సీబీఐ ఫోబియా పట్టుకుందేంటి? అసలు దాని వెనకాల పడేందుకు దానికున్న చట్టబద్ధతేంటి? చట్టంలో దానికి స్థానమెక్కడైనా ఉందా? గౌహతి హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వటం వల్లే అది బతికి బట్టకడుతోంది. మేం మాత్రం సీబీఐ గురించి ఏమాత్రం పట్టించుకోం’’ అంటూ హైకోర్టు ధర్మాసనం సోమవారం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరికి చెందిన కెనెటా పవర్కు భూ కేటాయింపులపై సీబీఐ, ఈడీల చేత దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్కుమార్తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. బాలశౌరి ఆస్తులు, కెనెటా పవర్ లిమిటెడ్కు భూ కేటాయింపులపై దర్యాప్తునకు ఆదేశించాలంటూ న్యాయవాది ఎం.వి.వి.ఎస్.ప్రసాద్ గతవారం ఈ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. కోర్టు స్పందిస్తూ... ‘‘స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా? ముందు అది చేయండి. వారు స్పందించకుంటే మా వద్దకు రండి’’ అని చెప్పింది. తాము రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు, సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేసినట్లు పిటిషనర్ చెప్పగా... ‘‘అదంతా మాకు చెప్పొద్దు. పోలీసులకు ఫిర్యాదు చేశారో లేదో చెప్పండి’’ అని స్పష్టంచేసింది.
పలు కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందని పిటిషనర్ చెప్పగా... తమకు చట్టం ఏం చెబుతుందో అదే ముఖ్యమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ‘‘కోల్కతాలో ఓ బాలిక తప్పిపోయిన కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ అధికారులు ఆ బాలిక ఆచూకీ కనుక్కోలేకపోయారు. స్థానిక పోలీస్ స్టేషన్లోని ఓ ఎస్సై విజయవంతంగా ఆ కేసును ఛేదించి బాలిక ఆచూకీ కనుక్కున్నారు. సీబీఐ పనితీరు ఎలాంటిదో దీనినిబట్టి తెలుసుకోండి’’ అని ధర్మాసనం చెప్పింది. భూ కేటాయింపులకు మాత్రమే పరిమితమైతే పిటిషన్ను విచారిస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది. దీంతో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.
సీబీఐ వెంట పడతారేం?: హైకోర్టు
Published Tue, Apr 29 2014 2:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
ఆస్పత్రిలో హీరోయిన్.. మత్తు మందు.. బాధ తట్టుకోలేకపోతున్నా!
కవితకు బిగ్ షాక్...నో బెయిల్
మళ్లీ సీఎం జగనే.. బాపట్ల రేపల్లె సిద్ధం (ఫొటోలు)
టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు
ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్లు వీరే..
‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!
ధైర్యమున్నంత వరకూ పోరాడతా..జస్ప్రీత్ వీడియో వైరల్ : ఆనంద్ మహీంద్ర ఫిదా
సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- Parvathipuram: ఎన్ఆర్ఐకు ఎదురుగాలి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement