నీటిని పొదుపు చేద్దాం | Walk for Water at KBR park | Sakshi
Sakshi News home page

నీటిని పొదుపు చేద్దాం

Mar 22 2016 10:17 AM | Updated on Sep 4 2018 5:07 PM

నీటిని పదిలంగా వాడుకుని, భవిష్యత్తును కాపాడుకుందామని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు.

నీటిని పదిలంగా వాడుకుని, భవిష్యత్తును కాపాడుకుందామని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా కేబీఆర్ పార్కులో మంగళవారం ఉదయం జరిగిన వాక్ ఫర్ వాటర్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడారు. వాటర్ హార్వెస్టింగ్ పాయింట్లను నిర్మించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి చెప్పారు. బంగారం కంటే విలువైన నీటిని జాగ్రత్తగా వాడుకుందామని ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రామ్‌మోహన్, సినీ నటుడు, రచయిత తనికెళ్ల భర ణి పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement