రేపటిలోగా ‘లైఫ్‌ ఎవిడెన్స్‌’ ఇవ్వాలి | Until tomorrow "Evidence of Life ' should be give | Sakshi
Sakshi News home page

రేపటి వరకు ‘లైఫ్‌ ఎవిడెన్స్‌’ ఇవ్వాలి

Aug 29 2016 10:18 PM | Updated on Oct 8 2018 7:48 PM

ఆసరా పింఛన్‌దారులందరూ ఆగస్టు 31లోగా తమకు సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రంలో లైఫ్‌ ఎవిడెన్స్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ భారతి హోళికేరి సూచించారు.

సాక్షి, సిటీబ్యూరో: ఆసరా పింఛన్‌దారులందరూ ఆగస్టు 31లోగా తమకు సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రంలో లైఫ్‌ ఎవిడెన్స్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ భారతి హోళికేరి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి పింఛన్లు, ఇళ్లు, ఉద్యోగాలు, రుణాలు తదితర అంశాలకు సంబంధించిన వినతి పత్రాలను ఆమె స్వీకరించారు. పింఛన్‌ ఆగిపోకుండా సకాలంలో ఖాతాలో జమ కావాలంటే బయోమెట్రిక్‌ నమోదు తప్పనిసరని, ఇప్పటి వరకు లైఫ్‌ ఎవిడెన్స్‌ వెరిఫికేషన్‌ చేసుకోని ఆసరా పింఛన్‌దారులందరూ వెంటనే ఆ పని పూర్తి చేసుకోవాలన్నారు. వెరిఫికేషన్‌కు వెళ్లేటప్పుడు ఆధార్‌కార్డు తప్పని సరిగా వెంట తీసుకెళ్లాలన్నారు. మీ కోసంలో వచ్చిన వినతి పత్రాలన్నింటిని త్వరితగతిన పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు జేసీ సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement