నగరంలోని లంగర్హౌజ్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది.
హైదరాబాద్: నగరంలోని లంగర్హౌజ్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ట్యాంకర్ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.