ఫార్మాకు దక్షిణం వైపు రీజినల్ రింగ్ రోడ్డు
అలైన్మెంట్ మార్చేందుకు సర్కారు కసరత్తు
భవిష్యత్తు అవసరాల కోసం తప్పదన్న కన్సల్టెన్సీ
నేడు జరిగే సమావేశంలో తుది నిర్ణయం
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రతిపాదిత రీజినల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) దిశ మార్చుకుంటోంది. ఔషధనగరి (ఫార్మాసిటీ) సమీపంలో ఈ రోడ్డు అలైన్మెంట్ మారుతోంది. ప్రతిష్టాత్మక ఫార్మాసిటీకి దక్షిణం వైపు నుంచి ఈ మార్గాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ఔటర్రింగ్ రోడ్డుకు ఆవల నుంచి ప్రాంతీయ బాహ్య వలయ దారిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిపై వాహనాల భారం తగ్గించే లా 338 కిలోమీటర్ల మేర ఈ రహదారిని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. అందుకు అనుగుణంగా నిర్మాణ వ్యయాన్ని భరించేం దుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) కింద ఈ రోడ్డును చేపట్టేలా ఖరారు చేయాలని, సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసి ప్రాజెక్టును పట్టాలెక్కించాలని భావించింది. అయితే, ఆదిలోనే హంసపాదులా ఫార్మాసిటీ రూపంలో ఈ రోడ్డుకు అడ్డంకి వచ్చింది. కందుకూరు, యాచారం, కడ్తాల మండలాల పరిధిలో దాదాపు 19వేల ఎకరాల విస్తీర్ణంలో ఔషధన గరిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులోభాగంగా ఇప్పటికే దాదాపు ఏడు వేల ఎకరాల భూమిని కూడా సేకరించింది. ఈ ఏడాది చివరినాటికి ప్రాజెక్టుకు భూమి పూజ కూడా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీశైలం–సాగర్ హైవేల మధ్య 11 కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేస్తోంది.
రింగ్రోడ్డుతో భారీ నష్టం!
అత్యున్నతస్థాయి ప్రమాణాలతో ప్రపంచంలోనే మూడో అతిపెద్దదిగా ఆభివర్ణిస్తున్న ఫార్మాసిటీకి రీజిన ల్ రింగ్రోడ్డుతో నష్టం వాటిల్లనుందని ఈ ప్రాజెక్టుకు మాస్టర్ప్లాన్ రూపొందిస్తున్న ‘సురబాన జ్యూరంగ్’ కన్సల్టెన్సీ తేల్చిచెప్పింది. ఔషధనగరికి ఉత్తరం వైపు నుంచి రింగ్రోడ్డును ప్రతిపాదిస్తూ హెచ్ఎం డీఏ మాస్టర్ ప్లాన్లో పొందుపరిచింది. ఈ ప్రతిపాదిత రహదారితో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని, వీటిని అధిగమించేందుకు దక్షిణ దిశలో రీజినల్ రింగ్రోడ్డును నిర్మించ డం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తద్వారా ఔషధనగరికి ఇబ్బంది కలుగకుండా.. సాధారణ ప్రయాణికులు ఆవస్థల పాలుగాకుండా నివారించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వాని కి ఇటీవల నివేదిక ఇచ్చింది. వాస్తవానికి ప్రస్తుతం షాద్నగర్ మీదుగా కందుకూరు మండలం కొత్తూ రు నుంచి మంచాల మండలం ఆగాపల్లి మీదుగా సాగుతుంది. ప్రతిపాదనలు పరిశీలిస్తే.. కడ్తాల సమీపం గుండా ఈ రహదారిని నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
నేడు కీలక సమావేశం
రీజినల్ రింగ్రోడ్డు రీఅలైన్మెంట్పై బుధవారం సచివాలయంలో అత్యున్నతస్థాయి సమావేశంలో జరుగుతోంది. ఈ సమావేశంలో ఫార్మాసిటీ సమీపంలో ఈ రహదారి అలైన్మెంట్ మార్పుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆర్అండ్బీ, పరిశ్రమలు, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శులు, హెచ్ఎండీఏ కమిషనర్, ఎన్హెచ్ఐఏ ప్రాంతీయ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాల్గొనున్నారు.
మారిన రీజినల్ రింగ్ రోడ్డు
Published Tue, Jan 10 2017 11:45 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement