'ఇస్తాంబుల్ అన్నారుగా ఏమైంది' | Trs govt should be said about Isthamble | Sakshi
Sakshi News home page

'ఇస్తాంబుల్ అన్నారుగా ఏమైంది'

Jun 22 2016 8:19 PM | Updated on Oct 17 2018 3:38 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్ తరహాలో అభివృద్ధి చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. మరీ ఇప్పుడు ఇస్తాంబుల్ ఏమైందో ప్రజలకు చెప్పాలని తెలంగాణ శాసనపక్ష ప్రతిపక్ష నేత కె జానారెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్ తరహాలో అభివృద్ధి చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. మరీ ఇప్పుడు ఇస్తాంబుల్ ఏమైందో ప్రజలకు చెప్పాలని తెలంగాణ శాసనపక్ష ప్రతిపక్ష నేత కె జానారెడ్డి డిమాండ్ చేశారు.

బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజల సెంటిమెంట్, అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లా ఏర్పాటు అయితే సరేకానీ, రాజకీయ అవసరాల కోసం జిల్లాలను విభజించొద్దని చెప్పారు. యాదగిరిగుట్టను జిల్లా చేయాలని తాను కోరుతున్నట్టు జానారెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement