=మరొకరికి తీవ్ర గాయాలు
=మితిమీరిన వేగం ప్రమాదానికి కారణం
దుండిగల్, నూస్లైన్: అతి వేగం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. ఓవర్టేక్ చేయబోయిన ఆటో ముందు వస్తున్న కంటైనర్ను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో బ్యాంక్లో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్తున్న ఇద్దరు డ్వాక్రా గ్రూపు సభ్యులు, మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. ఇంకో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన సోమవారం దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..
నల్లగొండ జిల్లా తిమ్మాపురానికి చెందిన భార్యాభర్తలు వెంకటేశ్, రాజేశ్వరి (30), రంగారెడ్డి జిల్లాకు చెందిన తాండూర్కు చెందిన దంపతులు నర్సింహ, చిట్టెమ్మ(34) నగరంలోని నిజాంపేట రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఉంటున్నారు. కాగా డ్వాక్రా గ్రూపు రాజీవ్గాంధీ పొదుపు జ్యోతి సంఘానికి రాజేశ్వరి, చిట్టెమ్మ టీమ్ లీడ్లరుగా వ్యవహరిస్తున్నారు. సోమవారం గండిమైసమ్మలోని ఎస్బీహెచ్ బ్యాంక్లో డబ్బులు డ్రా చేసేందుకు రాజీవ్గృహకల్పలో ఆటో ఎక్కారు.
అది బౌరంపేట సమీపంలోని డాంబర్ ప్లాంట్ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టెక్ చేయబోయి ఎదురుగా వస్తున్న హర్యానాకు చెందిన కంటైనర్ను ఢీ కొట్టింది. లారీ ఎదురుగా వేగంగా ఢీకొట్టడంతో పాటు సుమారు 20 అడుగుల వరకు ఆటోను లాక్కెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ రాజేశ్వరి, చిట్టెమ్మలతో పాటు బాచుపల్లి సాయినగర్కు చెందిన ఆటో డ్రైవర్ నర్సింహ(40) అక్కడికక్కడే మృతి చెందారు. నర్సింహ అల్లుడు నరేశ్కు తీవ్ర గాయాలవడంతో అతన్ని 108లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాజేశ్వరి, చిట్టెమ్మల తలలు నుజ్జునుజ్జయ్యాయి. కంటైనర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. దుండిగల్ సీఐ బాలకృష్ణ సంఘటనా స్థలానికి చేసుకుని ట్రాఫిక్ను నియంత్రించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాపులో ఉంది.
రాజీవ్ గృహకల్పలో విషాదఛాయలు
రాజేశ్వరి, చిట్టెమ్మల మృతితో నిజాంపేట రాజీవ్ గృహకల్పలో విషాదఛాయలు అలుముకున్నాయి. డ్వాక్రా గ్రూపునకు లీడర్లుగా వ్యహరిస్తూ ఎంతో కలివిడిగా ఉండే వారి హఠాన్మరణంతో ఆ ప్రాంత మహిళలు కన్నీరు మున్నీరయ్యారు. రాజేశ్వరి, చిట్టెమ్మలు దినసరి కూలీలుగా పని చేస్తుండగా.. వీరిద్దరికీ ఇద్దరు చిన్న పిల్లలున్నారు. కాగా చిట్టెమ్మ భర్త నర్సింహ మానసిక స్థితి బాగాలేదని స్థానికులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
Published Tue, Dec 3 2013 4:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement