నగరంలోని ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కుంభకోణంలో ముగ్గురు నిందితులను..
హైదరాబాద్: నగరంలోని ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కుంభకోణంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పారిశ్రామిక వేత్తలకు అప్పనంగా ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసిన మూసాపేట సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావును మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదేవిధంగా అప్పనంగా భూములను పొందిన గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా ప్రతినిధి పార్థసారథిని, అకౌంటెంట్ శర్మలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరికొంతమంది బిల్డర్ల అరెస్టు రంగం సిద్ధమైందని తెలుస్తోంది.