
'మక్కా మృతుల్లో మా రాష్ట్రం వారు లేరు'
మక్కా ప్రమాద మృతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు లేరనా ఆ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు.
హైదరాబాద్: మక్కా ప్రమాద మృతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు లేరనా ఆ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ, వైఎస్సార్ జిల్లా కడపలో హజ్ హౌస్లను నిర్మిస్తామని తెలిపారు.
అదే విధంగా కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక హోదాపై దీక్ష చేసే నైతిక హక్కు జగన్కు లేదని పల్లె అన్నారు. మరో ప్రాంతంలో దీక్ష చేస్తే అనుమతి ఇస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.