mecca tragedy
-
'మక్కా మృతుల్లో మా రాష్ట్రం వారు లేరు'
హైదరాబాద్: మక్కా ప్రమాద మృతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు లేరనా ఆ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ, వైఎస్సార్ జిల్లా కడపలో హజ్ హౌస్లను నిర్మిస్తామని తెలిపారు. అదే విధంగా కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక హోదాపై దీక్ష చేసే నైతిక హక్కు జగన్కు లేదని పల్లె అన్నారు. మరో ప్రాంతంలో దీక్ష చేస్తే అనుమతి ఇస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. -
మక్కా ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: మక్కాలో జరిగిన తొక్కిసలాటపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సౌదీ వెళ్లిన తెలంగాణ భక్తుల యోగక్షేమాలు తెలుసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మక్కాలో గురువారం పవిత్ర హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగి సుమారు 310 మంది హజ్ యాత్రికులు దుర్మరణం చెందారు. మరో 500మందికి పైగా గాయపడ్డారు. సైతాన్ను రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ దుర్ఘటన జరింది. 15 రోజుల వ్యవధిలో ఇది రెండో సంఘటన. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయినవారిలో వివిధ దేశాలకు చెందినవారుగా ఉన్నారు.