మక్కా ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి | i was shocked on mecca tragedy says kcr | Sakshi
Sakshi News home page

మక్కా ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి

Sep 24 2015 3:58 PM | Updated on Aug 14 2018 10:54 AM

క్కాలో జరిగిన తొక్కిసలాటపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హైదరాబాద్: మక్కాలో జరిగిన తొక్కిసలాటపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సౌదీ వెళ్లిన తెలంగాణ భక్తుల యోగక్షేమాలు తెలుసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

మక్కాలో గురువారం పవిత్ర హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగి సుమారు 310 మంది హజ్ యాత్రికులు దుర్మరణం చెందారు. మరో 500మందికి పైగా గాయపడ్డారు.  సైతాన్ను రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ దుర్ఘటన జరింది.  15 రోజుల వ్యవధిలో ఇది రెండో సంఘటన.  కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  చనిపోయినవారిలో వివిధ దేశాలకు చెందినవారుగా ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement