స్ట్రాంగ్‌రూంలను పరిశీలించిన కమిషనర్ | The Commissioner observed strangrunlanu | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌రూంలను పరిశీలించిన కమిషనర్

Dec 15 2015 6:18 PM | Updated on Aug 21 2018 12:12 PM

గ్రేటర్ ఎన్నికలకు ఏర్పాట్లు అప్పుడే ప్రారంభమయ్యాయి.

గ్రేటర్ ఎన్నికలకు ఏర్పాట్లు అప్పుడే  ప్రారంభమయ్యాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ 8 డివిజన్లలో జరిగే ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలను భద్ర పరిచే విషయంపై ఐడీపీఎల్ కాలనీ స్కూల్‌ను మంగళవారం సికింద్రాబాద్ నార్త్ జోన్ కమిషనర్ హరిచందన దాసరి పరిశీలించారు. మొత్తం నాలుగు స్ట్రాంగ్ రూంలతో పాటు 8 వార్డులకు ఒకటి చొప్పున కౌంటింగ్ హాల్‌లను గుర్తించారు. ఈఈ పర్యవేక్షణలో స్థానికంగా ఏర్పాట్లు జరగాలని ఆమె ఆదేశించారు. సర్కిల్ పరిధిలో మొత్తం 4,53,100 ఓటర్లు ఉండగా 429 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఉప కమిషనర్ గీత రాధిక తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement