'కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్య నైజాన్ని కోల్పోయింది' | Tammineni Veerabhadram takes on kcr govt | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్య నైజాన్ని కోల్పోయింది'

Jul 26 2015 12:28 PM | Updated on Aug 16 2018 3:23 PM

'కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్య నైజాన్ని కోల్పోయింది' - Sakshi

'కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్య నైజాన్ని కోల్పోయింది'

మున్సిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించకుంటే ఆగస్టు మొదటివారంలో 'ఛలో హైదరాబాద్'కి పిలుపు ఇస్తామని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

హైదరాబాద్ : మున్సిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించకుంటే ఆగస్టు మొదటివారంలో 'ఛలో హైదరాబాద్'కి పిలుపు ఇస్తామని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్ లో మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్య నైజాన్ని కోల్పోయిందని ఆరోపించారు.

వరంగల్కు త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పది వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఎన్నికల బరిలో నిలబెడతామని తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేతపై నిపుణులు, అఖిలపక్షంతో చర్చించాలని తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసం నీటి ప్రాజెక్ట్ డిజైన్లు మార్చవద్దంటూ కేసీఆర్ ప్రభుత్వానికి తమ్మినేని వీరభద్రం హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement