నిందితులుగా సబిత, రిటైర్డ్ ఐఏఎస్ కృపానందం
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)కి ముడి ఇనుప గనుల కేటాయింపు కేసులో రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందంలను సీబీఐ నిందితులుగా చేర్చింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో బుధవారం అనుబంధ చార్జిషీట్ను దాఖలు చేసింది. ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి సెలవులో ఉండడంతో మొదటి అదనపు జడ్జి రమేష్ ఎదుట ఈ అనుబంధ చార్జిషీట్ సీబీఐ అధికారులు దాఖలు చేశారు. కృపానందాన్ని ఎనిమిది, సబితా ఇంద్రారెడ్డిని తొమ్మిదో నిందితులుగా పేర్కొన్నారు.
సబితా ఇంద్రారెడ్డిని ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్లో సాక్షిగా పేర్కొన్నామని, అయితే ఈ కుట్రలో ఆమె పాత్ర ఉన్నట్లు తేలడంతో ఆమెను నిందితురాలిగా చేర్చామని నివేదించారు. ఈ మేరకు ఆమెను నిందితురాలిగా మార్చేందుకు అనుమతించాలని కోర్టును కోరుతూ సీబీఐ మరో మెమోను దాఖలు చేసింది. దీనిపై విచారణను కోర్టు ఈనెల 25కు వాయిదా వేసింది.
అక్రమాలకు పాల్పడ్డారు: ఓఎంసీకి గనుల లీజుల మంజూరులో అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గనుల శాఖ కార్యదర్శి కృపానందం అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ తన అనుబంధ చార్జిషీట్లో ఆరోపించింది. క్యాప్టివ్ (సొంత పరిశ్రమ అవసరాలకు మాత్రమే) అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే తొలగించి ఓఎంసీకి అనుకూలంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ పదాన్ని తొలగించడంతోనే ఓఎంసీ ముడి ఇనుమును ఎగుమతి చేసుకోగలిగిందని తెలిపింది. ఐపీసీ 120(బి) రెడ్విత్ 409, అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్విత్ 13(1)(డి) సెక్షన్ల కింద వీరిపై అభియోగాలను మోపింది. అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం మినహా లీజుల కేటాయింపులో అక్రమాలు తదితర అంశాలపై దర్యాప్తు పూర్తయ్యిందని కోర్టుకు నివేదించింది. 65 పేజీల అనుబంధ చార్జిషీట్తోపాటు 104 అనుబంధ పత్రాలు, 36 మందిని సాక్షులుగా పేర్కొంది. ఈ కేసులో 2011 డిసెంబర్లో సీబీఐ దాఖలు చేసిన ప్రధాన చార్జిషీట్లో సబితను 53వ సాక్షిగా, మొదటి, రెండవ అనుబంధ చార్జిషీట్లలో 8వ సాక్షిగా చేర్చింది. అయితే ప్రధాన చార్జిషీట్ దాఖలు చేసిన దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత ఆమెను నిందితురాలిగా చేర్చుతూ సీబీఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం.
ఈ కేసులో మిగతా నిందితులు: ఓఎంసీ కంపెనీ డెరైక్టర్ గాలి జనార్దన్రెడ్డి, ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి, గనులశాఖ మాజీ డెరైక్టర్ వి.డి.రాజ్గోపాల్, సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గాలి జనార్దన్రెడ్డి సహాయకుడు అలీఖాన్, గనులశాఖ అధికారి లింగారెడ్డి (చనిపోయారు)లతో పాటు ఓఎంసీ కంపెనీని ఈ కేసులో నిందితుల జాబితాలో సీబీఐ చేర్చింది.
ఓఎంసీ కేసులో అనుబంధ చార్జిషీట్
Published Thu, Apr 10 2014 1:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement