డీసీఎం ఢీకొని విద్యార్థిని మృతి | student mamatha died and one injured in a road accident | Sakshi
Sakshi News home page

డీసీఎం ఢీకొని విద్యార్థిని మృతి

Aug 11 2015 7:43 PM | Updated on Nov 9 2018 4:31 PM

మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాటేదాన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతిచెందింది.

హైదరాబాద్ సిటీ: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాటేదాన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. రోడ్డు దాటుతున్న ఇద్దరు విద్యార్థులను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో మమత(16) అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా.. మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. గాయపడిన విద్యార్థినిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement