రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికే రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలూ అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బీఆర్ మీనాకు బాధ్యతలు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికే రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలూ అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ రాజీవ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై రిజిస్ట్రేషన్ల శాఖకు కూడా ముఖ్య కార్యదర్శిగా రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్.మీనా వ్యవహరించనున్నారు. 2010 వరకు రెండు శాఖలు ఒకే ముఖ్య కార్యదర్శి పరిధిలో ఉండగా, దాదాపు ఐదేళ్ల తర్వాత తిరిగి ఒకే ముఖ్య కార్యదర్శి పరిధిలోకి తేవడం గమనార్హం. ముఖ్య కార్యదర్శి, కమిషనర్ వంటి కీలక పోస్టుల్లో రెగ్యులర్ అధికారులు ఉండకపోవడంతో గందరగోళంగా తయారైన రిజిస్ట్రేషన్ల శాఖను, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి పరిధిలోకి తేవడం పట్ల రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.