రోహిత్ తల్లికి రాహుల్ పరామర్శ | rahul gandhi condolence to vemula rohit | Sakshi
Sakshi News home page

రోహిత్ తల్లికి రాహుల్ పరామర్శ

Jan 19 2016 1:25 PM | Updated on Sep 3 2017 3:55 PM

రోహిత్ తల్లికి రాహుల్ పరామర్శ

రోహిత్ తల్లికి రాహుల్ పరామర్శ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ కుటుంబ సభ్యులను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు.

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ కుటుంబ సభ్యులను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. మంగళవారం హెచ్సీయూకు వచ్చిన రాహుల్.. రోహిత్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. రోహిత్ తల్లి రాధికను ఓదార్చి, హెచ్సీయూలో జరిగిన ఘటనల గురించి అడిగితెలుసుకున్నారు.

రాహుల్.. హెచ్సీయూ విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు హెచ్సీయూకు వచ్చారు.  హెచ్‌సీయూలో సస్పెన్షన్కు గురైన పీహెచ్‌డీ విద్యార్థి, గుంటూరుకు చెందిన వేముల రోహిత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement