బాబు.. టీడీపీ వాళ్లంతా ఆర్థిక నేరగాళ్లే
సుజనాచౌదరిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: రఘువీరారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబుతో సహా టీడీపీలోని అందరూ ఆర్థిక నేరగాళ్లేనని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. ఆదివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బ్యాంకులను మోసం చేసిన కేసులో సుజనాచౌదరిపై అరెస్టు వారెంట్ జారీ అయినప్పటికీ ఇంతవరకు ఆయన్ని మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించలేదో బాబు సమాధానం చెప్పాలన్నారు. సుజనాను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ సీఎం విమర్శించడంపై మండిపడ్డారు.