'17 నుంచి 19 వరకు రాచకొండ ఉత్సవాలు' | Rachakonda utsavas to be organized from 17 to 19 | Sakshi
Sakshi News home page

'17 నుంచి 19 వరకు రాచకొండ ఉత్సవాలు'

Apr 11 2017 2:47 AM | Updated on Sep 5 2017 8:26 AM

రాచకొండ గొప్పతనాన్ని చాటేందుకు రాచకొండ పర్యాటక ఉత్స వాలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తెలిపారు. కొందరు యువకులు రాచప్ప సమితిగా ఏర్పడి ఉత్సవాలు జరుపుతున్నారని పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: రాచకొండ గొప్పతనాన్ని చాటేందుకు రాచకొండ పర్యాటక ఉత్స వాలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తెలిపారు. కొందరు యువకులు రాచప్ప సమితిగా ఏర్పడి ఉత్సవాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. సోమవారం రవీంద్రభారతిలో రాచకొండ ఉత్సవాల పోస్టర్‌ను కర్నె ఆవిష్కరించారు.

ఈ నెల 17, 18, 19 తేదీల్లో రాచకొండ శివాలయం వద్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  13, 14 శతాబ్దాల్లో రాచకొండను రాజధాని గా చేసుకుని పాలించిన రేచర్ల పద్మ నాయ కులు అద్భుత కట్టడాలు నిర్మించారని అన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement