తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు రేపటి నుంచి నిరవధిక బంద్ పాటించనున్నట్టు విద్యా సంస్థల జేఏసీ ఓ ప్రకటనలో తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు రేపటి నుంచి నిరవధిక బంద్ పాటించనున్నట్టు విద్యా సంస్థల జేఏసీ ఓ ప్రకటనలో తెలిపింది. విద్యా సంస్థలపై పోలీసు, విజిలెన్స్ దాడులకు నిరసనగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు జేఏసీ ప్రకటించింది. ఈ నెల 30వ తేదీలోపు ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసింది. విద్యా శాఖ అధికారులతోనే తనిఖీ చేయించాలని, లోపాలు ఉంటే సరిచేసుకోవడానికి ఏడాది సమయం ఇవ్వాలని డిమాండ్ చేసింది. కార్పొరేట్ విద్యా సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది.