► అర్ధనగ్న సెల్ఫీలు సేకరించి బ్లాక్మెయిల్
► అమ్మాయిలపై వల వేస్తున్న సైబర్ నేరగాళ్లు
► కేసులు పెట్టేందుకు ముందుకురాని తల్లిదండ్రులు
► తెలిసిన వారి చేతుల్లోనే ఎక్కువ మోసాలు
► ఎవరికీ ఫొటోలు ఇవ్వద్దని సైబర్ క్రైం పోలీసుల సూచన
హైదరాబాద్
అమ్మాయిలను బుట్టలో వేసుకుని.. వాళ్లతో అర్ధనగ్నంగా సెల్ఫీలు తీసుకుని.. ఆ తర్వాత ఆ ఫొటోలతో వాళ్లను బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యవహారాలు హైదరాబాద్లో ఎక్కువయ్యాయి. సఫిల్గూడకు చెందిన నిజాముద్దీన్ హైదర్ (32) 2011లో హైదరాబాద్కు ఇంటర్వ్యూకు వచ్చిన ఎంబీఏ విద్యార్థినితో పరిచయం పెంచుకుని, తాను అనాథనని చెప్పి స్నేహం చేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. రెండేళ్ల పాటు వారి స్నేహం కొనసాగింది. ఈ మధ్యలో ఆమెతో సన్నిహితంగా ఉంటూ సెల్ఫీలు తీసుకున్నా, ఆమెకు అనుమానం రాలేదు. తర్వాత అతడికి అప్పటికే పెళ్లయిన విషయం ఆమెకు తెలిసింది. అప్పట్నుంచి ఆ సెల్ఫీలతో ఆమెను బ్లాక్మెయిల్ చేయడంతో ఆమె సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఎట్టకేలకు మొన్న ఏప్రిల్ నెలలో నిజాముద్దీన్ను అరెస్టు చేశారు.
మరోకేసులో, భోలానగర్కు చెందిన అబ్దుల్ మాజిద్ (21) కొందరు టీనేజి అమ్మాయిల నుంచి వందలాదిగా అర్ధనగ్న సెల్ఫీలు సేకరించాడు. ఫేస్బుక్లో వాళ్లతో అమ్మాయిలా చాట్ చేస్తూ ఇవి తీసుకున్నాడు. అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు కూడా తెలియని చాలా విషయాలు అతడితో చెప్పేవారు. మందుకొట్టడం, సిగరెట్లు తాగడం, బోయ్ఫ్రెండ్లు, సెక్స్ అనుభవాలు.. అన్నింటినీ వెల్లడించేవారు. ఆ ఫొటోలు, వివరాలు తీసుకున్న తర్వాత.. వాటిని ఇంటర్నెట్లో పెడతానంటూ అతడు వాళ్లను బ్లాక్మెయిల్ చేశాడు. ఏడు నెలల్లోనే రెండుసార్లు అరెస్టయిన అతడిపై పోలీసులు పీడీ యాక్ట్ కూడా పెట్టారు.
మహిళలు ఎ్టటి పరిస్థితుల్లోనూ సెల్ఫీలను ఇతరులకు షేర్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రైం విభాగానికి వచ్చే కేసుల్లో చాలావరకు తమకు తెలిసినవారి చేతుల్లో మోసపోయేవారే ఉంటున్నారన్నారు. చాలా కేసుల్లో అమ్మాయిల తల్లిదండ్రులు కేసు పెట్టడానికి ఇష్టపడకపోవడంతో పోలీసులు నిందితులను పట్టుకున్నా, ఫొటోలు డిలీట్ చేసి.. వాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చి పంపేయాల్సి వస్తోంది.
అమ్మాయిలూ.. సెల్ఫీలతో జరభద్రం!
Published Sat, May 28 2016 12:30 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదిన నటి రాధ
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
Advertisement