శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన | Passengers protest over airindia flight delay | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన

Jul 12 2016 10:50 AM | Updated on Apr 7 2019 3:28 PM

శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు మంగళవారం ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో  ప్రయాణికులు మంగళవారం ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కోల్కతా వెళ్లే 120మంది ప్రయాణికులు  ఉదయం అయిదు గంటల నుంచి    పడిగాపులు పడుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు గంటల కొద్ది విమానాశ్రయంలో తిప్పలు పడాల్సి వస్తున్న విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement