అమెరికాలో పలు కంపెనీలతో మంత్రి కేటీఆర్ విస్తృత చర్చలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికీ వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తామని, దీంతో దేశంలోని టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ రంగాల్లో విప్లవాత్మక మార్పులొస్తాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. అమెరికా పర్యట నలో భాగంగా బుధవారం శాన్ఫ్రాన్సిస్కో నగరంలో టెలికం దిగ్గజాలైన నోకియా, ఎరిక్సన్ కంపెనీలతో ఆయన సమావేశమై చర్చించారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగస్వా ములు కావాలని ఆ కంపెనీలను ఆహ్వానించగా, నోకియా ఆసక్తి కనబరిచింది.
త్వరలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఆసక్తి వ్యక్తీకరణ (ఆర్ఎఫ్సీ) కోసం నిర్వహించే టెండర్లలో పాల్గొంటామని నోకియా ప్రతినిధి బృందం తెలిపింది. తెలంగాణలో నోకియా మొబైల్ ఫోన్ పరికరాల తయారీ ప్లాంటు లేదా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయా లని కోరారు. అక్కడి ఎరిక్సన్ కంపెనీని సందర్శించి అక్కడి ఎక్స్పీరియన్స్ సెంట ర్ను పరిశీలించారు. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ముఖాముఖి అయ్యారు.
మ్యూల్సాఫ్ట్ కూడా ఆసక్తి..
రాష్ట్రంలో తమ కంపెనీ విస్తరణ అవకాశాల ను పరిశీలిస్తామని, హైదరాబాద్ను కూడా తమ భవిష్యత్తు విస్తరణ ప్రణాళికల్లో చేర్చు తామని మ్యూల్ సాఫ్ట్ కంపెనీ హామీ ఇచ్చింది. హైదరాబాద్లో మ్యూల్సాఫ్ట్ విస్త రణకు ఉన్న అవకాశాలను కేటీఆర్ కంపెనీ ప్రతినిధులకు వివరించారు. కాగా, అధిక సంఖ్యలో స్టార్టప్స్ ఉన్న టీ–హబ్తో కలసి పనిచేసేందుకు స్ట్రైప్ సంస్థ ముందుకొచ్చిం ది. సిలికాన్ వ్యాలీలో టీ–హబ్ ఏర్పాటు చేసిన టీ–బ్రిడ్జితో కలసి పనిచేస్తామని స్ట్రైప్ ప్రతినిధులు తెలిపారు. డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంద ని, ఆర్థిక సేవలందించే స్ట్రైప్ సంస్థకు రాష్ట్రం అనుకూల ప్రాంతమని మంత్రి వివరించారు. అమెరికాలో కంపెనీలు ఏర్పాటు చేయాలను కునే వారికోసం అట్లాస్ ద్వారా సహకారమం దిస్తామని స్ట్రైప్ ప్రతినిధులు తెలిపారు. అంతకు ముందు శాన్ఫ్రాన్సిస్కోలోని సేల్స్ ఫోర్స్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
ఫైబర్ గ్రిడ్పై నోకియా ఆసక్తి
Published Thu, May 25 2017 2:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement