క్లీన్‌చిట్‌పై అనుమానాలు: నాగం | Nagam Janardhana Reddy on Miyapur land scam | Sakshi
Sakshi News home page

క్లీన్‌చిట్‌పై అనుమానాలు: నాగం

Jun 17 2017 2:14 AM | Updated on Oct 19 2018 7:27 PM

క్లీన్‌చిట్‌పై అనుమానాలు: నాగం - Sakshi

క్లీన్‌చిట్‌పై అనుమానాలు: నాగం

భూకుంభకోణాలపై ప్రభుత్వపరంగా ఎలాంటి నివేదికలు ఇవ్వ కుండానే ఒక్క గజం కబ్జా కాలేదని సీఎం చేసిన ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: భూకుంభకోణాలపై ప్రభుత్వపరంగా ఎలాంటి నివేదికలు ఇవ్వ కుండానే ఒక్క గజం కబ్జా కాలేదని సీఎం చేసిన ప్రకటన అనేక అనుమానాలకు తావిస్తోందని బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రకటన ఆధారంగానే మియాపూర్‌ భూ బకాసురులకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని ఆరోపించారు. అధికార పార్టీ నేతలను, తన ఆత్మగా ఉన్న వ్యక్తిని కాపాడేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఒక ప్రకటనలో ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement