పంజగుట్ట.. అసలే రద్దీ కూడలి. అటువంటి చౌరస్తాకు ఇరుపక్కలా మైట్రోరైలు సంస్థ మాల్స్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ స్థితిగతులు ఎలా ఉండనున్నాయి?
=ప్రభావంపై అంచనా కోసం అధ్యయనం
=పంజగుట్ట, ఇతరచోట్ల శ్రీకారం
=ఫలితాల తరవాతే నిర్మాణ అనుమతులు
సాక్షి, సిటీబ్యూరో: పంజగుట్ట.. అసలే రద్దీ కూడలి. అటువంటి చౌరస్తాకు ఇరుపక్కలా మైట్రోరైలు సంస్థ మాల్స్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ స్థితిగతులు ఎలా ఉండనున్నాయి? మాల్స్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలా? వద్దా?.. ఇవన్నీ తేల్చేందుకు నగర ట్రాఫిక్ విభాగం ట్రాఫిక్ సమగ్ర అధ్యయనానికి సోమవారం శ్రీకారం చుట్టింది. అధ్యయన ఫలితాలను బట్టి అనుమతిపై నిర్ధారణకు వస్తుంది. పంజగుట్ట జంక్షన్, మార్గం, ప్రాంతం మీదుగా ఏ సమయంలో ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి? అవి ఏ రకానికి చెందినవనేది శాస్త్రీయ అధ్యయనం చేశాక సదరు నిర్మాణానికి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వాలా? లేదా? అనేది నిర్ధారించడానికే ఈ అధ్యయనం నిర్వహిస్తున్నారు.
ప్రధానంగా పంజగుట్ట కేంద్రంగా...
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం పంజగుట్ట చౌరస్తాకు రెండు కి.మీ. పరిధిలో ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. ఇలా కేటాయించిన ఎర్రమంజిల్లోని పోలీసు క్వార్టర్లు, జంక్షన్ సమీపంలోని ప్రభుత్వ క్వార్టర్స్ స్థలాల్లో భారీ మాల్స్ నిర్మాణానికి మెట్రోరైల్, ఎల్ అండ్ టీ యోచిస్తున్నాయి. దీనికి ట్రాఫిక్ పోలీసులు నిరభ్యంతర పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే పంజగుట్ట చౌరస్తాలో అనేక భారీ మాల్స్తో పాటు సమీపంలోనే నిమ్స్ వంటివి ఉన్నాయి. దీంతో కొత్తగా వచ్చే మాల్స్ వల్ల ట్రాఫిక్పై పడే ప్రభావాన్ని అంచనా వేసేందుకు అధ్యయనం చేస్తున్నారు.
రెండు విధాలుగా అధ్యయనం...
పంజగుట్ట చుట్టూ ఉన్న ఆరు జంక్షన్లతో పాటు ఎనిమిది ప్రాంతాల్లో తాజా అధ్యయనాన్ని చేపట్టారు. ఇది రెండు విధాలుగా చేస్తున్నారు. సాధారణంగా సోమవారం మొదటి పనిదినం కావడంతో రద్దీ ఎక్కువుంటుందని దీన్ని ప్రారంభించారు. జంక్షన్, చౌరస్తాలోని అన్ని మార్గాల్లో ఉండి, కీలక రోడ్ల మధ్యలో ఉండి సమయాలను బట్టి వాహనాలను కేటగిరీల వారీగా నమోదు చేస్తున్నారు. ప్రతి రోడ్డుకూ కనీసం 8 మందిని కేటాయించి వాహనాలను లెక్కిస్తున్నారు. సోమవారం రాత్రి 12 గంటల వరకు జరిగిన ఈ ప్రక్రియను అవసరమైతే పొడిగించాలని నిర్ణయించారు. జంక్షన్, దాని చుట్టుపక్కలున్న వ్యాపార సంస్థలు, వాటి రద్దీ వేళలు, ఏ తరహా వాహనాలు ఏ సమయంలో ఎక్కువగా, ఎక్కడకు వస్తున్నాయి? వంటివన్నీ పరిశీలిస్తారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి సేకరించిన గణాంకాలను నిపుణుల సహకారంతో విశ్లేషించిన అనంతరం ఁమెట్రో మాల్స్రూ.కు ఎన్ఓసీ ఇచ్చే అంశాన్ని నిర్ధారిస్తారు.
ట్రాఫిక్ ఇంపాక్ట్ స్టడీకి వినియోగం
ఒక ప్రాంతంలో కొత్తగా వచ్చిన నిర్మాణాలు, పెరిగిన వాహనాల సంఖ్య, రద్దీ, మారిన పరిస్థితుల కారణంగా ట్రాఫిక్పై పడిన ప్రభావాన్ని అధ్యయనం చేయడాన్ని ఁట్రాఫిక్ ఇంపాక్ట్ స్టడీరూ. అంటారు. ఓ ప్రాంతంలో ఫ్రీ లెఫ్ట్, స్ట్రెయిట్ రైట్ తదితర కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే అక్కడున్న ట్రాఫిక్ వాల్యూమ్ తెలియడం అవసరం. నగరం విస్తరణ, వాహనాల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ అధ్యయనాలు అవసరమని అధికారులు చెబుతున్నారు.
పరిశీలన ఇక్కడే..
ఎస్సార్నగర్, పంజగుట్ట, ఖైరతాబాద్, మోనప్ప ఐలాండ్, తాజ్కృష్ణ, కేసీపీ జంక్షన్లలోనూ, రాజ్భవన్, గ్రీన్పార్క్ హోటల్ రోడ్, సీఎం క్యాంప్ కార్యాలయం, మైత్రివనం, తాజ్ కృష్ణ, ఎర్రమంజిల్, షాలిమార్, షాదన్ కాలేజ్ రోడ్ల మధ్యలోనూ ఉండి ట్రాఫిక్ను అధ్యయనం చేస్తున్నారు.