సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లను గురువారం విద్యార్థులకు కేటాయించారు. రెండ్రోజులపాటు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్లో ఆప్షన్లను ఎంచుకున్న విద్యార్థులకు సీటు పొందిన కాలేజీ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా తెలిపారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్సైట్లో కాలేజీలు, సీట్ల జాబితా వివరాలు అందుబాటులో ఉంచారు. 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటులోని కన్వీనర్ కోటాలో ఉన్న 2,075 ఎంబీబీఎస్ సీట్లను, అలాగే 12 డెంటల్ కాలేజీల్లోని 606 సీట్లను (స్పోర్ట్స్, ఎన్సీసీ, మిలటరీ కోటా మినహా) భర్తీ చేశారు.
సీట్లు పొందిన విద్యార్థులు శుక్రవారం నుంచి ఈ నెల 25 మధ్యాహ్నం 2 గంటల వరకు కాలేజీల్లో చేరవచ్చని, మరుసటి రోజు నుంచే (26వ తేదీ) తరగతులు ప్రారంభమవుతాయని కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్, మిలటరీకి ఒక శాతం, ఎన్సీసీకి 0.5 శాతం సీట్ల కేటాయింపు చేయాల్సి ఉందని.. ఆ ప్రక్రియ కొద్దిగా ఆలస్యమవుతుందని వెల్లడించారు. ఎంసెట్-3లో మొదటి ర్యాంకర్ రేగళ్ల ప్రపుళ్ల మానస ఉస్మానియా మెడికల్ కాలేజీలో, రెండో ర్యాంకర్ పి.శ్రీహారిక గాంధీ మెడికల్ కాలేజీలో, మూడో ర్యాంకర్ తప్పెట తేజస్విని, నాలుగో ర్యాంకర్ జీషాన్ అహ్మద్ జలీలి, ఐదో ర్యాంకర్ ఇక్రమ్ ఖాన్లు ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు పొందారన్నారు. ఆరో ర్యాంకర్ అడ్ల శ్రీకంఠేశ్వర్రెడ్డి గాంధీ మెడికల్ కాలేజీ, ఏడో ర్యాంకర్ మిట్టపల్లి అలేఖ్య, ఎనిమిదో ర్యాంకర్ నుజాత్ ఫాతిమా ఉస్మానియా మెడికల్ కాలేజీ, తొమ్మిదో ర్యాంకర్ కావ్య బలుసు, పదో ర్యాంకర్ వెంపటి రూపీష్ గాంధీలో సీటు పొందారు.
ఓపెన్లో కటాఫ్ 1,205, ఎస్సీలో 7,125
రెండ్రోజులపాటు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్లో 11,866 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆప్షన్లు ఇచ్చిన వారి వివరాలను పరిశీలించిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు గురువారం కట్ ఆఫ్ ర్యాంకు వివరాలు ప్రకటించారు. ఓపెన్ కేటగిరీలో 1,205 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 7,125 ర్యాంకు వరకు సీట్లు దక్కాయి. ఎస్టీ కేటగిరీలో 5,582, బీసీ ‘ఎ’లో 5,765, బీసీ ‘బి’లో 2,359, బీసీ ‘సి’లో 3,582, బీసీ ‘డి’లో 2,477, బీసీ ‘ఇ’లో 2,582 ర్యాంకుల వరకు కట్ ఆఫ్ వచ్చింది.
‘ఉస్మానియా’లో బీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్
రాష్ట్రంలోని 14 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,050 ఎంబీబీఎస్ సీట్లుండగా అందులో 713 బీ కేటగిరీ సీట్లు ఉన్నాయి. వాటికి ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ముగియగా.. శుక్ర, శనివారాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని దూర విద్యా కేంద్రం లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొదటి రోజు 9 గంటలకు 1 నుంచి 500 సీరియల్ నంబరు గల విద్యార్థులు, మధ్యాహ్నం 2 గం. నుంచి 500-1,000 నంబర్ విద్యార్థులు హాజరు కావాలని ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు తెలిపాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి 1,001-2,000 నంబర్ విద్యార్థులు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 2,001-4,101 నంబర్ విద్యార్థులు హాజరుకావాలని పేర్కొన్నాయి.
నేటి నుంచి ‘మెడికల్’ అడ్మిషన్లు
Published Fri, Sep 23 2016 4:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement