కూల్చివేతలను పరిశీలిస్తున్న మేయర్ | mayor moniterthird day Demolition of buildings | Sakshi
Sakshi News home page

కూల్చివేతలను పరిశీలిస్తున్న మేయర్

Sep 28 2016 2:27 PM | Updated on Sep 4 2017 3:24 PM

నాలాల ఆక్రమణలు, అక్రమ కట్టడాల కూల్చివేతలను జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలిస్తున్నారు.

హైదరాబాద్: నాలాల ఆక్రమణలు, అక్రమ కట్టడాల తొలగింపు మూడోరోజు కొనసాగుతోంది. ఈ కూల్చివేతలను జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలిస్తున్నారు. మల్కచెరువు, రాయదుర్గం చెరువుల్లో అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. అలాగే, చెరువు లోతట్టు ప్రాంతంలోని బఫర్ జోన్‌లో నిర్మించిన పెద్ద షెడ్డును కూల్చివేస్తున్నారు. మేయర్ వెంట జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి కూడా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement