జూన్‌లో ‘మెట్రో’ ట్రయల్ రన్ | June 'Metro' Trial Run | Sakshi
Sakshi News home page

జూన్‌లో ‘మెట్రో’ ట్రయల్ రన్

Mar 3 2014 4:27 AM | Updated on Oct 16 2018 5:07 PM

జూన్‌లో ‘మెట్రో’ ట్రయల్ రన్ - Sakshi

జూన్‌లో ‘మెట్రో’ ట్రయల్ రన్

నగరవాసుల కలల మెట్రో రైలు ట్రయల్న్ ్రఈ ఏడాది జూన్‌లో ప్రారంభం కానుం ది. ఉప్పల్ మెట్రో డిపో దీనికి వేదిక కానుంది.

సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల కలల మెట్రో రైలు ట్రయల్న్ ్రఈ ఏడాది జూన్‌లో ప్రారంభం కానుం ది. ఉప్పల్ మెట్రో డిపో దీనికి వేదిక కానుంది. ముం దుగా అనుకున్న ప్రకారమే 2015 మార్చి 21న (ఉగా ది రోజున) నాగోల్-మెట్టుగూడ రూట్లో మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

నాగోల్-రహేజా మైండ్‌స్పేస్, జూబ్లీబస్‌స్టేషన్-ఫలక్‌నుమా, ఎల్బీనగర్-మియాపూర్ రూట్లలో మొత్తం 72 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టును 2017 జూన్ (నిర్ణయించిన గడువు) లోగా పూర్తిచేస్తామని ప్రకటించారు. ఆదివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఆయనతో నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమానికి నగరవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. పలువురు సిటీజనులు వివిధ అంశాలపై ఎండీని ఫోన్‌లో ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement