సమ్మె కారణంగా పరీక్షలు వాయిదా | Sakshi
Sakshi News home page

సమ్మె కారణంగా పరీక్షలు వాయిదా

Published Fri, Sep 2 2016 8:31 AM

jntuh exam postponed due to bharat bandh

హైదరాబాద్: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని కళాశాలల్లో శుక్రవారం జరగాల్సిన అన్నీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్(డీఈ) ఆంజనేయప్రసాద్ వెల్లడించారు.

ఈ రోజు జరగాల్సిన ఎంబీఏ, ఎంసీఏ, మొదటి సెమిస్టర్ పరీక్ష సెప్టెంబర్ 16వ తేది మధ్యాహ్నం, రెండో సెమిస్టర్ పరీక్ష అదే రోజు ఉదయం నిర్వహించనున్నట్లు వివరించారు. అలాగే బీటెక్, బీఫార్మసీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13న నిర్వహించనున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement