'మాటిమాటికి అబద్ధాలాడుతున్నారు' | Jeevan reddy questioned government on drought mandals issue | Sakshi
Sakshi News home page

'మాటిమాటికి అబద్ధాలాడుతున్నారు'

Mar 20 2016 11:55 AM | Updated on Mar 18 2019 9:02 PM

'మాటిమాటికి అబద్ధాలాడుతున్నారు' - Sakshi

'మాటిమాటికి అబద్ధాలాడుతున్నారు'

మాటిమాటికి అబద్ధాలాడితే అది ప్రివిలేజ్ కిందకు వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్: మాటిమాటికి అబద్ధాలాడితే అది ప్రివిలేజ్ కిందకు వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో మాట్లాడుతూ.. కరువు మండలాల గుర్తింపులో రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లాలో రామ్ ప్రాజెక్టు ఉందని, ఆ కారణం చేత కరువు మండలం జాబితాలో ప్రకటించలేదని చెప్పారు. కానీ రామ్ ప్రాజెక్టులో చుక్క నీరు కూడా లేదని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. కలెక్టర్ ఇచ్చిన నివేదికను కూడా పట్టించుకోలేదని, కరువు మండలాల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement