పలువురు ఐఏఎస్ల బదిలీలు | IAS officers transfer in andhrapradeah | Sakshi
Sakshi News home page

పలువురు ఐఏఎస్ల బదిలీలు

Sep 12 2016 7:50 PM | Updated on Sep 4 2017 1:13 PM

పలువురు ఐఏఎస్ల బదిలీలు

పలువురు ఐఏఎస్ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) వైస్‌ఛైర్మన్ కమ్ మేనేజింగ్ డెరైక్టర్ (వీసీఎండీ)గా పనిచేస్తున్న శ్రీధర్‌ను ప్రభుత్వం పరిశ్రమల (భూగర్భ గనుల) శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. ఈయనకు భూగర్భ గనుల శాఖ సంచాలకులుగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈయనతోపాటు కొందరు అఖిల భారత సర్విసు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సాల్మొన్ ఆరోఖ్య రాజ్‌కు ఏపీఐఐసీ వీసీఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న ఎం. గిరిజా శంకర్‌ను ఆంధ్రప్రదేశ్ పర్యటక అభివృద్ధి సంస్థ (ఏపీ టీడీసీ) మేనేజింగ్ డెరైక్టర్‌గా బదిలీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ పరిశ్రమలు, వాణిజ్య (ఆహార శుద్ధి)శాఖ కార్యదర్శిగా కూడా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని గిరిజా శంకర్‌ను ఆదేశించింది.

ఏపీ మౌలిక సదుపాయాల సంస్థ (ఇన్‌క్యాప్) వీసీఎండీగా ఉన్న ఇండియన్ ఫారెస్ట్ సర్విస్ అధికారి రమేష్ కుమార్ సుమన్‌ను ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ నుంచి ఉపసంహరించి తదుపరి పోస్టింగ్ కోసం రాష్ట్ర అటవీ దళాల అధిపతిని సంప్రదించాలని సూచించింది. రాష్ట్ర ఫైబర్‌నెట్ వర్క్ మేనేజింగ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న కె.సాంబశివరావుకు ఇన్‌క్యాప్ వీసీఎండీగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement