బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.
మంగళవారం సాయంత్రం వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లూరు, సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీపీ పల్లిల్లో అత్యధికంగా 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల దాకా తగ్గాయి. గత 24 గంటల్లో భద్రాచలం, హకీంపేట, ఖమ్మం, మెదక్, నిజామాబాద్ల్లో 26 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే 6 డిగ్రీలు తక్కువగా 19 డిగ్రీలు నమోదైంది.