మెరుగైన వైద్యం అందించేందుకు కృషి | Effort to provide a better healing | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యం అందించేందుకు కృషి

May 9 2016 1:24 AM | Updated on Sep 3 2017 11:41 PM

మెరుగైన వైద్యం అందించేందుకు కృషి

మెరుగైన వైద్యం అందించేందుకు కృషి

నగరం నలుమూలలా నాలుగు ఆస్పత్రులు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం కృషి ....

శేరిలింగంపల్లి: నగరం నలుమూలలా నాలుగు ఆస్పత్రులు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.ల క్ష్మారెడ్డి తెలిపారు. శేరిలింగంపల్లి నల్లగండ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రణామ్ వెల్‌నెస్ సెంటర్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.

ప్రజలకు అవసరమైన విధంగా వైద్య సేవలు అందించేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ ముందుకు వస్తున్నాయని, అందులో భాగంగానే వెల్‌నెస్ సెంటర్‌లు నూతన పంథాలో ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రణామ్ హాస్పిటల్ డాక్టర్ మనీష్ గౌర్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాతయాదవ్, కార్పొరేటర్లు కె.సాయిబాబ, రాగం నాగేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement