
అన్యాయం జరిగింది.. న్యాయం చేయండి
న్యాయవ్యవస్థ విభజనలో భాగంగా న్యాయాధికారుల కేటాయింపులకు సంబంధించి హైకోర్టు విడుదల చేసిన ప్రాథమిక జాబితాపై తెలంగాణ న్యాయాధికారులు శనివారం ఉమ్మడి హైకోర్టు
ఏసీజేకు తెలంగాణ న్యాయాధికారుల వినతి
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థ విభజనలో భాగంగా న్యాయాధికారుల కేటాయింపులకు సంబంధించి హైకోర్టు విడుదల చేసిన ప్రాథమిక జాబితాపై తెలంగాణ న్యాయాధికారులు శనివారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే ను కలసి అభ్యం తరం వ్యక్తం చేశా రు. కేటాయింపు ల్లోతమకు అన్యా యం జరిగిందని, ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు ఏసీజేను అభ్యర్థించారు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ బొసాలేను ఆయన నివాసంలో కలసి అభినందించిన తెలంగాణ న్యాయాధికారులు.. ఆయనకు వినతిపత్రం సమర్పించారు.
కేడర్ వారీగా రెండు రాష్ట్రాలకు ప్రతిపాదించిన కేటాయింపుల నిష్పత్తిని, స్థానికత ఆధారంగా తెలంగాణకు కేటాయించిన వారి వివరాలను జాబితాలో పేర్కొనలేదని వారు ఏసీజేకు వివరించారు. అసలు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల విభజనకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. అయితే హైకోర్టు ఇందుకు విరుద్ధంగా మార్గదర్శకాలను రూపొందించిందన్నారు. ఆ మార్గదర్శకాలనైనా పరిగణనలోకి తీసుకోకుండా న్యాయాధికారులు ఇచ్చిన ఆప్షన్లను బట్టి కేటాయింపులు చేశారన్నారు. మార్గదర్శకాల ప్రకారం ఒకచోట ఖాళీలు భర్తీ అయ్యాక మిగిలిన పోస్టులనే మరో రాష్ట్రానికి కేటాయించాలని, దీనికి విరుద్ధంగా ఏపీలో ఖాళీలున్నా పెద్ద సంఖ్యలో న్యాయాధికారుల్ని తెలంగాణకు కేటాయించారన్నారు.
రాష్ట్ర విభజన తరువాత 2 రాష్ట్రాలకు కేటాయింపులు జరిపి ఆ తరువాత పదోన్నతులివ్వాలని.. అలాకాకుండా కామన్ సీనియారిటీని తయారు చేసి పదోన్నతులు కల్పించారని అన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని జస్టిస్ బొసాలే హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఏసీజేను కలసిన వారిలో సంఘం అధ్యక్షుడు కె.రవీందర్రెడ్డి, ఉపాధ్యక్షులు పి.చంద్రశేఖర ప్రసాద్, డాక్టర్ సున్నం శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.వరప్రసాద్ తదితరులున్నారు.