కళ్ల ముందే కన్నుమూశాడు... | Died in front of public | Sakshi
Sakshi News home page

కళ్ల ముందే కన్నుమూశాడు...

Apr 30 2016 10:56 AM | Updated on Sep 3 2017 11:03 PM

కళ్ల ముందే కన్నుమూశాడు...

కళ్ల ముందే కన్నుమూశాడు...

ఈయన సుభాష్‌నగర్ డివిజన్ పాండుబస్తీకి చెందిన అర్జున్ నాయక్.వయసు 60. భార్యతో గొడవపడి గురువారం ఇల్లు వదిలి వచ్చిన ఆయన సాయిబాబానగర్ హమీద్ బస్తీ ఉర్దూ పాఠశాల ఆవరణలో ఎండకు ఇలా సొమ్మసిల్లి పడివున్నాడు.

హైదరాబాద్: ఈయన సుభాష్‌నగర్ డివిజన్ పాండుబస్తీకి చెందిన అర్జున్ నాయక్.వయసు 60. భార్యతో గొడవపడి గురువారం ఇల్లు వదిలి వచ్చిన ఆయన సాయిబాబానగర్ హమీద్ బస్తీ ఉర్దూ పాఠశాల ఆవరణలో ఎండకు ఇలా సొమ్మసిల్లి పడివున్నాడు.




► శుక్రవారం ఉదయం 10.30 గంటలు. నాయక్‌ను గమనించిన స్థానికులు అతడిని లేపి మంచి నీళ్లు, కాస్తంత తిండి అందించారు. కానీ తినలేని పరిస్థితి అతనిది.



► స్థానికుల సమాచారంతో వచ్చిన 108 సిబ్బంది కొన ఊపిరితో ఉన్న అతడికి ప్రాథమిక చికిత్స అందించారు. సెలైన్ పెట్టారు. కానీ... ఫలితం శూన్యం... ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. పోలీసుల సాయంతో ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతిచెందినట్టు నిర్ధారించారు.
► మండే ఎండలు... వడ గాడ్పులు... నిండు ప్రాణాలను నిలువునా బలితీసుకున్న మరో విషాదం ఇది. కట్టెలు కొట్టుకుని జీవించే ఈ శ్రమజీవి తాపానికి తట్టుకోలేక కళ్లముందే కుప్పకూలిన ఈ ఘటన అక్కడివారి హృదయాలను ద్రవింపజేసింది.  
 - హైదరాబాద్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement