ఆంధ్రజ్యోతిపై పరువునష్టం కేసు: ఆర్కే వాంగ్మూలం | Court record statement of ysrcp mla alla ramakrishna reddy over defamation case against andhrajyothi | Sakshi
Sakshi News home page

ఆంధ్రజ్యోతిపై పరువునష్టం కేసు: ఆర్కే వాంగ్మూలం

Aug 1 2017 12:15 PM | Updated on Oct 30 2018 4:08 PM

ఆంధ్రజ్యోతిపై పరువునష్టం కేసు: ఆర్కే వాంగ్మూలం - Sakshi

ఆంధ్రజ్యోతిపై పరువునష్టం కేసు: ఆర్కే వాంగ్మూలం

ఆంధ్రజ్యోతి దినపత్రికపై పరువునష్టం కేసులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని నాంపల్లి కోర్టు మంగళవారం నమోదు చేసింది.

హైదరాబాద్‌ : ఆంధ్రజ్యోతి దినపత్రికపై పరువునష్టం కేసులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని నాంపల్లి కోర్టు మంగళవారం నమోదు చేసింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై తప్పుడు కథనం ప్రచురించి, పరువుకు భంగం కలిగించేలా వార్తలు రాశారంటూ ఎమ్మెల్యే ఆర్కే... ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్‌ వెంకట శేషగిరిరావు, ఎడిటర్‌ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌ 17వ అదనపు చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై స్పందించిన కోర్టు తదుపరి చర్యల్లో భాగంగా తొలుత ఎమ్మెల్యే ఆర్కే వాంగ్మూలాన్ని నమోదుకు ఆదేశించింది. దీంతో కోర్టు ఇవాళ ఆయన స్టేట్‌మెంట్ను రికార్డు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement