రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో దారుణం | Couple suicide in rajendranagar | Sakshi
Sakshi News home page

రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో దారుణం

Jan 30 2016 8:03 AM | Updated on Jul 10 2019 8:00 PM

రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో దారుణం చోటు చేసుకుంది. చిన్నారి సహా దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని శనివారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేశారు.

హైదరాబాద్ : రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో దారుణం చోటు చేసుకుంది. చిన్నారి సహా దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని శనివారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో దంపతులు ఇద్దరు మరణించారు. చిన్నారి మాత్రం తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దంపతుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement